• Login / Register
  • Site Logo

    మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పోలీసులు, సిట్ బృందం వెళ్లింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

    The post మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment