నవతెలంగాణ – మల్హర్ రావుమండల ఎంపీడీఓగా కాంత్రికుమార్ ను నియమిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఎంపీడీఓగా పనిచేసిన శ్యామసుందర్ పదవీ విరమణ పొందారు. బదిలీపై వచ్చిన క్రాంతికుమార్ సోమవారం మండల ఎంపిడిఓగా బాధ్యతలు చెపట్టారు. ఆయనకు ఎంపిడిఓ కార్యాలయం అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ విక్రమ్ కుమార్,సూపర్ డెంట్ శ్రీరామమూర్తి,ఎపిఓ హరీష్,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
The post మల్హర్ ఎంపీడీఓగా క్రాంతికుమార్ appeared first on Navatelangana.
Leave A Comment