నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర కన్నుమూశారు. హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా పేరుపొందిన ధర్మేంద్ర ఈ లోకం విడిచివెళ్లడంతో బాలీవుడ్ దుఃఖసాగరంలో మునిగిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ధర్మేందకు అప్పటి కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం తీసుకున్నారు.
The post బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. appeared first on Navatelangana.
Leave A Comment