నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో అక్రమంగా చెట్లు కొట్టిన విషయంపై అధికారులు విచారణ చేపట్టి 12160 రూపాయలు జరిమానా అటవీశాఖ రేంజ్ అధికారి రమేష్ నాయక్ విధించినట్లు గ్రామస్తులు తెలిపారు. తాజ్ పూర్ గ్రామంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికిన విషయంపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ, జరిపించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
The post చెట్లు నరికినందుకు రూ.12, 160 జారీమానా… appeared first on Navatelangana.
Leave A Comment