నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు వయోలెన్స్ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహణకు 1,500 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, 5,000 మందికిపైగా అభిమానులు తరలివచ్చారు. అనుమతికి మించి జన సమీకరణతో రోడ్లు స్తంభించాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో FIR నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
The post ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్పై కేసు నమోదు appeared first on Navatelangana.
Leave A Comment