నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని మల్లారం గ్రామానికి చెందిన చాట్లపల్లి పురుషోత్తం గుండెపోటుతో, రుద్రారం గ్రామానికి అప్పాల ఐలయ్య విద్యుత్ షాక్ తో ఇటీవల మరణించారు. మృతుల కుటుంబాలను బుధవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ పరామర్షించి ఓదార్చారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ చెప్యాల రామారావు,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ పాల్గొన్నారు.
The post మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ.! appeared first on Navatelangana.
Leave A Comment