• Login / Register
  • Site Logo

    న్యాయవాది స్వప్న తల్లి కన్నుమూత..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కుమార్తె హత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి మల్లమ్మ (70) అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. స్వప్న తండ్రి శాంతయ్య పదేళ్ల క్రితమే మృతి చెందారు. స్వప్న సోదరుడు గొటిక రాజు వివాహం చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇటీవలే అన్న రాజు, మరో ముగ్గురు కలిసి ఆస్తి కోసం స్వప్నను హత్య చేసిన విషయం తెలిసిందే.

    The post న్యాయవాది స్వప్న తల్లి కన్నుమూత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment