ఒక రోజు గాంధీజీకి గొప్ప పండితుడు పర్చూర్ శాస్త్రి నుండి సంస్కృతంలో
ఒక లేఖ వచ్చింది. అందులో ఆయన తాను కుష్టు వ్యాధితో బాధపడుతున్నానని, ఇంటి నుండి, సమాజం నుండి బహిష్కరణకు గురై జీవితాన్ని భారంగా గడుపుతున్నానని బాధపడతారు. ఆయన గాంధీజీని "మీరు అనుమతిస్తే నేను సేవాగ్రామ్కు వచ్చి ప్రశాంతంగా జీవించాలనుకుం టున్నాను" అని తన మనసులోని మాటను చెప్తారు.
మరుసటి రోజు ప్రార్థన సమావేశంలో ఆశ్రమ నివాసితులందరి ముందు గాంధీజీ ఈ లేఖను చదివారు. ఆ సమయంలో కుష్టు వ్యాధి అంటువ్యాధిగా పరిగణిస్తున్నందున ఆశ్రమ నివాసితులలో నిశ్శబ్దం. సంస్కృతంలో గొప్ప పండితుడైనప్పటికీ, పర్చూర్ శాస్త్రిని తన కుటుంబ సభ్యుల నుండి తొలగించటానికి అదే కారణం.
ప్రార్థన సమావేశంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, కుష్టు రోగి పడుతున్న బాధ సామాన్యమైనది కాదని, సేవాగ్రామ్లో పర్చూర్ శాస్త్రి ఉంటారని, నేను వారికి సేవ చేస్తానని గాంధీజీ అన్నారు.
"మనం బాధపడే ఆత్మను ఇక్కడ చూసుకోలేమా? నేను చెప్తున్నాను. ఆ కుష్టు వ్యాధి అశుద్ధమైనదో లేదా అంటువ్యాధో కాదు. కానీ మన కరుణకు ఇది పరీక్షా సమయం" అని చెప్పారు గాంధీజీ.
కొన్ని రోజుల తర్వాత పర్చూర్ శాస్త్రి సేవాగ్రామ్కు చేరుకున్నారు.
గాంధీజీ ఆయనకు స్వయంగా తన సేవను ప్రారంభించారు. పర్చూర్ శాస్త్రికి సేవ చేయడం, ఆయన గాయాలు కడగడం, బట్టలు కట్టడం, తన చేతులతో స్నానం చేయించడం, తన చేతులతో ఆయనకు ఆహారం పెట్టడం, గాంధీజీ దినచర్యగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన వారి కళ్ళు తడిసిపోయాయి. జాతిపిత స్వయంగా ఒక రోగి పాదాలను కడుగుతుండటం,. తువ్వాలుతో తుడుస్తుండటం చూసి అందరూ విస్తుపోయారు.
ఆ సమయంలో దేశ స్వాతంత్ర్య పోరాటం కీలకమైన మలుపులో ఉంది. వైస్రాయ్ లార్డ్ వెవెల్ జూన్ 1945లో సిమ్లా చర్చల కోసం కాంగ్రెస్ ప్రధాన నాయకులందరినీ పిలిచారు. గాంధీజీ కూడా కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి సలహాదారుగా అక్కడికి వెళ్లారు. బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. లార్డ్ వెవెల్ ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని సంప్రదించడానికి చర్చలను 7 రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
గాంధీజీ కార్యదర్శి మహదేవ్ దేశాయ్ కుమారుడు శ్రీ నారాయణ్ భాయ్ దేశాయ్, చర్చలు సత్ఫలితాలను ఇవ్వని క్రమంలో ఈ ఏడు రోజుల్లో తాను సిమ్లాలో తిరుగుతానని, పర్వతాలను అధిరోహిస్తానని, ఆనందిస్తానని అనుకున్నానని చెప్పారు. కానీ సేవాగ్రామ్ తిరిగి రావడానికి తన సొంత పడకలను ఏర్పాటు చేసుకోవాలని గాంధీజీ ఆదేశించారు.
బాపూజీ రైలులో చేరుకోవడానికి రెండు రోజులు, రైలులో తిరిగి రావడానికి రెండు రోజులు పడుతుందని నారాయణ్ భాయ్ చెప్పారు. మూడు రోజులు సేవాగ్రామ్కు వెళ్లి మీరు ఏమి చేస్తారు? పర్చూర్ శాస్త్రికి సేవ చేయడానికి నాకు మూడు రోజులు లభిస్తాయని గాంధీజీ చెప్పారు.
సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు సిమ్లా నుండి సేవాగ్రామ్ చేరుకున్నారు. అక్కడ పర్చూర్ శాస్త్రి ఉన్నారు. శాస్త్రి చాలా బలహీన స్థితిలో ఉన్నారు. గాంధీజీ తలపై చేయి వేసి, నవ్వి, "శాస్త్రీజీ, నేను తిరిగి వచ్చాను" అని అన్నారు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందని శాస్త్రి అన్నారు.
గాంధీజీ మళ్ళీ తమ పాత దినచర్యను ప్రారంభించారు. సాయంత్రం వేళల్లో పర్చూర్ శాస్త్రి సేవ, గాయాలను శుభ్రం చేయడం, నూనె మసాజ్ చేయడం, ప్రార్థన సమావేశంలో ఆయనకు ప్రత్యేక పాఠం చెప్పడం వంటివి కొనసాగించారు.
శాస్త్రీజీ పరిస్థితి తీవ్రంగా ఉంది, కానీ ఆయన ముఖం సంతృప్తితో ప్రకాశిస్తోంది. వారి నోటి నుండి వచ్చినది అంతే "బాపూ, ఈ రోజు దేవుడే నా గాయాలను తాకినట్లు అనిపిస్తుంది" అని!
పర్చూర్ శాస్త్రి 1945 సెప్టెంబర్ 5న సేవాగ్రామ్లో మరణించారు. నేటికీ సేవాగ్రామ్ ఆశ్రమంలోని "పర్చూర్ కుటి"లో సజీవంగా ఉంది. ఇక్కడ ప్రతి ఇటుక కరుణ, సమానత్వం, మానవత్వాన్ని నిరూపిస్తుంది. గాంధీజీ శాస్త్రిని ఉద్దేశించి మాట్లాడుతూ "ప్రతి గాయానికి ప్రేమ గొప్ప నివారణ అని శాస్త్రి మనకు నేర్పించారు" అని అన్నారు.
- యామిజాల జగదీశ్
Leave A Comment