విమాన ప్రమాద ఘటనపై
క్రికెటర్ల సంతాపం
స్పోర్ట్స్ డెస్క్: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రషీద్ ఖాన్ తమ సంతాపం తెలిపారు గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
ఈ హృదయ విదారక ఘటనపై టీమ్ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , అఫ్గనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తమ సంతాపాన్ని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Leave A Comment