విశాఖపట్నం, సెప్టెంబర్ 17:
ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (AMTZ)లో కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. మెడ్టెక్ మరియు హెల్త్-టెక్ రంగాల్లో స్టార్టప్ ఇన్నోవేషన్లను వేగవంతం చేయడానికి “i-Passport” పేరుతో ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించారు.
ఈ కొత్త పోర్టల్ ద్వారా స్టార్టప్లకు R&D, టెస్టింగ్, తయారీ, ఫ్యాక్టరింగ్ వంటి అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి. స్టార్టప్ కంపెనీలకు కావాల్సిన పరిపాలనా సహాయం, ఫండింగ్ నెట్వర్క్లతో అనుసంధానం వంటి అంశాల్లో “i-Passport” ఒక బ్రిడ్జ్లా పనిచేయనుంది.
AMTZ అధికారులు మాట్లాడుతూ, “ఈ సదుపాయం వల్ల స్టార్టప్లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తక్కువ సమయంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురావడానికి సహాయపడుతుంది” అని తెలిపారు.
విశాఖపట్నంలో ఏర్పాటైన ఈ కొత్త వేదికతో హెల్త్ టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రతిభకు ప్రపంచ స్థాయి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Leave A Comment