విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి అనే ప్రతిభావంతమైన ఉపాధ్యాయురాలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంకు ఎంపిక కావడం గర్వకారణమైంది. ఆమె ఆధునిక బోధనా విధానాలను ప్రవేశపెట్టి విద్యా రంగంలో విశిష్టమైన సేవలు అందించారు.
సంప్రదాయ బ్లాక్బోర్డ్ బోధనకు భిన్నంగా, కళల సమగ్ర విద్య (Art-Integrated Education), ICT ఆధారిత బోధన పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆసక్తిని పెంపొందించారు. దీంతో విద్యార్థుల అభ్యాస విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
విద్యా రంగంలో సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించి, డిజిటల్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను భవిష్యత్తుకు సన్నద్ధం చేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది.
జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ అవార్డు విశాఖపట్నం విద్యా రంగానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి.
Leave A Comment